దిశఎఫెక్ట్ : జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

by  |
దిశఎఫెక్ట్ : జొన్నల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
X

దిశ,బోథ్: ప్రభుత్వం జొన్నలు వేయమని చెప్పి కొనకపోడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. మరికొందరు రైతులు చేసేది ఏమీలేక తక్కువ ధరకు ప్రైవేట్ వారికి అమ్ముకున్నారు. అయితే ఈ జొన్నల కొనుగోలు పై రైతుల అరిగోస, జొన్నరైతు ఆగమాగం అని దిశ వరస కథనాలు రాస్తూ ప్రభుత్వ దృష్టికి, ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకొని పోయింది. దీంతో నిన్న రాత్రి బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు, ఎమ్మేల్యే జోగు రామన్న , రేఖ నాయక్, హనుమంత్ షిండే జొన్నల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జొన్నలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కెసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Next Story

Most Viewed