గూడు చెదిరే.. ఆదివాసీల ఇళ్లను కూలగొట్టిన అటవీ‌శాఖ

by  |
గూడు చెదిరే.. ఆదివాసీల ఇళ్లను కూలగొట్టిన అటవీ‌శాఖ
X

దిశ, పలిమేల : జయ శంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం‌లోని కిష్టం పాడు గ్రామ శివారులో ఆదివాసుల ఇండ్లను అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం కూలగొట్టారు. గత నెల రోజుల క్రితము సర్వాయిపేట నీలంపల్లి బూర్గంపాడు గూడెం గ్రామాలకు చెందిన కొంత మంది ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరుచుకున్నారు. అటవీశాఖకు చెందిన భూమిని కొన్ని కుటుంబాలు గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. కాగా, వీరు ప్రభుత్వం ప్రకటించిన పథకంలో తమ భూములు వస్తాయనే ఆశతో అటవీశాఖ భూమిలో నివాసం ఏర్పరుచుకున్నారు. దీంతో అటవీ శాఖ వారు తమ భూమిలో గుడిసెలు వేసుకున్నారనే ఉద్దేశ్యంతో శుక్రవారం ట్రాక్టర్లతో ఇండ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. సుమారు 70 కుటుంబాల వారు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. అటవీశాఖ వారు ఆదివాసీల ఇండ్లను కూలగొట్టడంతో వారికి నిలువ నీడ లేకుండా పోయింది.

కొత్తగా నిర్మించినందుకే కూల్చేశాం..

ప్రభుత్వ నిబంధనల మేరకు తాము పనిచేస్తామని, ప్రభుత్వము శాఖ భూముల్లో ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని అడవిలోని చెట్లను కొట్టవద్దని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వారు ప్రభుత్వ ఆదేశాలు పక్కనపెట్టి గుడిసెలు వేసుకున్నందుకే, తాము కూల్చి వేశామని చేశామని రేంజర్ సంతోష్ దిశకు తెలిపారు.



Next Story

Most Viewed