మరింత ఆక్సిజన్ వచ్చేసింది..

by  |
మరింత ఆక్సిజన్ వచ్చేసింది..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా పేషెంట్ల కోసం మరింత ఆక్సిజన్​ వచ్చింది. ఇప్పటికే ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా ఒడిశా నుంచి దాదాపు 200 మెట్రిక్​టన్నుల ఆక్సిజన్​ వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో 9 ట్యాంకర్లు ప్రభుత్వాస్పత్రులకు, ఒక ట్యాంకర్​ను ప్రైవేట్​ ఆసుపత్రులకు పంపించిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాష్ట్రానికి తొలి ఆక్సిజన్​ రైలు చేరుకుంది. ఒడిశాలోని అంగూల్​ రైల్వే స్టేషన్​ నుంచి ఐదు ట్యాంకర్లతో శనివారం బయటలుదేరిన ఆక్సిజన్​ నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్​కు చేరింది. మొత్తం 63.6 మెట్రిక్​టన్నుల ఆక్సిజన్​ రాష్ట్రానికి చేరింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఆక్సిజన్​కొరత లేనట్టే. అంతేకాకుండా ఆదివారం రాత్రి మరికొన్ని ట్యాంకర్లతో ఒడిశాకు మరో రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.



Next Story

Most Viewed