సెల్ టవర్ ఎక్కిన రైతు.. అంతలో పోలీసులు

by  |
సెల్ టవర్ ఎక్కిన రైతు.. అంతలో పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తన భూమి చూపించాలంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జమలాపురం రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 9లో తనకు 8 ఎకరాల 22 గుంటల భూమి ఉందని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురైందని రైతు బెల్లంకొండ శివ కోటేశ్వరరావు(58) ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ… సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎర్రుపాలెం ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సదరు రైతు కిందకి దిగాడు.


Next Story

Most Viewed