ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ డైరెక్టర్ కీలక ఆదేశాలు

by  |
Public Health Director Srinivasa Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధితీవ్రతను బట్టి ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రైవేటు ఆసుపత్రులను ఆదేశించారు. వ్యాధి లక్షణాలు అధికంగా ఉండి సివియర్ కండీషన్ ఉంటే వెంటనే చేర్చుకొని చికిత్సలు అందించాలని సూచించారు.

వ్యాధి తీవత్ర ఎక్కువగా ఉన్న పేషెంట్ల కరోనా టెస్ట్ రిజల్ట్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాధి లక్షణాలు తక్కవగా ఉన్న పేషెంట్లను ఆసుపత్రుల్లో చేర్చుకోవద్దని హోం ఐసోలేషన్‌లోనే ఉండాల్సిందిగా సూచించాలని తెలిపారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రులు జనరల్, ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల వివరాలను విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు.

Next Story

Most Viewed