సైబర్ నేరాలను ఎదుర్కొవడమే లక్ష్యం: డీజీపీ

by  |
సైబర్ నేరాలను ఎదుర్కొవడమే లక్ష్యం: డీజీపీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: కొత్త ఏడాది సైబర్ నేరాలను ఎదుర్కోవడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం టీఎస్ఎస్పీ ప్రధాన కార్యాలయంలో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్న డీజీపీ కేక్‌ కట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి మొదలుకొని మండల పోలీస్‌ స్టేషన్ల వరకూ సేవలన్నీ ఒకేలా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్ అమలులో టీఎస్ఎస్పీ పాత్రను ప్రశంసించిన డీజీపీ.. కొవిడ్ సమయంలో గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా టీఎస్ఎస్పీ బెటాలియన్ల ఆర్మ్స్ ఇన్ స్పెక్షన్ అథారిటీ రూపొందించిన ‘హ్యాండ్ బుక్ ఫర్ ఆర్మర్స్’ బుక్‌ను ఆవిష్కరించారు.

Next Story

Most Viewed