‘కరోనా కంటే కరోనా కాలర్ ట్యూన్ ఇబ్బంది పెడుతుంది’

by  |
‘కరోనా కంటే కరోనా కాలర్ ట్యూన్ ఇబ్బంది పెడుతుంది’
X

దిశ, వెబ్ డెస్క్ : టీకాలు సరిపడ లేవు కానీ టీకా వేయించుకోమని చెబుతారా అంటూ కరోనా కాలర్ ట్యూన్ పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోన్ చేయగానే కాలర్ ట్యూన్ చిరాకుపరుస్తుందని అయినా మన దేశంలో వ్యాక్సిన్ సరిపడాలేదు ఇక ఆ కాలర్ ట్యూన్ ఎందుకు? కాల్ చేసిన ప్రతీసారి ఆ కాలర్ ట్యూన్‌తో విసిగిస్తున్నారంటూ తీవ్రంగా మండిపడింది. చూస్తుంటే ఈ కాలర్ ట్యూన్ ఇంకో పదేళ్లు కొనసాగేలా ఉందని, టీకాలు లేకున్నా తప్పకుండా టీకాలు వేసుకోమంటూ ఆ కాలర్ ట్యూన్ ద్వారా చెబుతున్నారని, వారికి టీకా ఎలా అందుతుందని, ఎవరు వేస్తారని కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా కంటే కరోనా కాలర్ ట్యూన్ ఇబ్బంది పెడుతుందన్నారు. డబ్బులు లేకున్నా పరవాలేదు కానీ అందరికీ టీకా ఇవ్వాలని జస్టిస్ విపిన్ సంఘి, రేఖా పల్లితో కూడిన ధర్మాసనం పేర్కొంది.


Next Story

Most Viewed