ప్రియుడితో కలిసి కన్న తల్లిని ఓ కూతురు..

by  |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని భోగాపురం మండలం సవరవిల్లిలో కన్న తల్లి అని కూడా చూడకుండా ఓ కూతురు.. ప్రియుడితో కలిసి గొంతు నులిమి ఆమెను హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి ప్రేమను అంగీకరించకపోవడంతో రూప శ్రీ, ప్రియుడు వరణ్ సాయి కలిసి లక్ష్మీ(రూప తల్లి)ని హత్య చేసినట్టు తెలిపారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో వారద్దరూ కలిసి తల్లిని హత్య చేసినట్టు తేలింది.

Next Story

Most Viewed