కారు బైక్ ఢీ.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు

by  |
కారు బైక్ ఢీ.. ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలో గల హైదరాబాద్-శ్రీశైలం 765 జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ బాణావత్ శ్రీను నాయక్ కు గాయాలయ్యాయి. బంధువులు తెలిపిన సమాచారం మేరకు బాధితుడు శ్రీనుకు ఎడమ కాలు, తలకు బలమైన గాయాలు అయ్యాయని, 108 వాహనం ద్వారా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వంగూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed