రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తాం: మల్ రెడ్డి

by  |
రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తాం: మల్ రెడ్డి
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: దిల్‌సుఖ్‌న‌గ‌ర్ లోని వ్యాపారుల ఇబ్బందుల‌ను మెట్రో రైలు అధికారులు గానీ, జీహెచ్ఎంసీ అధికారులు గానీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎల్బీన‌గ‌ర్ ఇంచార్జ్ మ‌ల్‌రెడ్డి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం దిల్‌సుఖ్‌న‌గ‌ర్ రాజీవ్ చౌక్ నుండి సాయిబాబా ఆల‌యం వ‌ర‌కు మెట్రో రైలు అధికారుల‌తో క‌లిసి ప‌రిస్థితిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గ‌త రెండేళ్లుగా స‌మ‌స్య ప‌రిష్కరించ‌డంలో అధికారులు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు. దీంతో స్థానికంగా వ్యాపార‌స్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు.

మెట్రో రైలు అధికారులు ఇరువైపులా రోడ్డును ఆక్రమించి ఫెన్సింగ్ పైపులు ఏర్పాటు చేయ‌డంతో దారి లేకుండా పోయింద‌న్నారు. దీంతో వ్యాపారస్తుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంన్నారు. వెంట‌నే స‌మ‌స్యను ప‌రిష్కరించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వహిస్తామ‌ని హెచ్ఛరించారు. ఈ కార్యక్రమంలో దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ స‌భ్యులు లింగాల వేణుగౌడ్‌, శ్రీ‌నివాస్‌, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed