ఆక్సిజన్ కొరతపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. సింగపూర్ నుంచి కొనుగోలు

by  |
oxygen tankers
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు కొవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత తీర్చడంపై కేంద్ర ప్రత్యేక దృష్టి సారించిది. ఈ క్రమంలోనే సింగపూర్ నుంచి నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు కొనుగోలు చేసింది. ఈ ట్యాంకర్లను వాయుసేనా యుద్ధ విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు.



Next Story

Most Viewed