వాహనదారులకు గుడ్ న్యూస్.. వాటి గడువు పెంపు

by  |
వాహనదారులకు గుడ్ న్యూస్.. వాటి గడువు పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాల డాక్యూమెంట్స్ అన్నీ అక్టోబరు 31వ తేదీ వరకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా డ్రైవింగ్‌ లైసెన్సు, ఫిట్‌నెస్‌, అన్ని రకాల పర్మిట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలకు ఇది వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత రెన్యువల్‌ చేయించుకోని వారి పత్రాల గడువును మొదట్లో సెప్టెంబర్ 30 వరకూ పెంచిన కేంద్రం తాజాగా అక్టోబర్ 31 వరకూ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


Next Story

Most Viewed