- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్: క్షణికావేశానికి గురైన ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారం సర్కిల్ దావూద్ బస్తీకి చెందిన జావేద్(32) సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై వెళ్తూ ఓ బాలికను ఢీ కొట్టాడు. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో జావేద్పై బాలిక తండ్రి శ్రీహరి గొడవకు దిగాడు. వెంటనే గమనించిన స్థానికులు ఇరువురిని సముదాయించి పంపించారు. అయినా.. శ్రీహరి ఆవేశం ఎంతకీ తగ్గకపోవడంతో సాయంత్రం క్షణికావేశానికి గురై జావేద్ను కత్తితో పొడిచి చంపాడు. సీసీ కెమెరాల ఆధారంగా హత్య చేసింది శ్రీహరినే అని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story