క్షణికావేషంలో యువకుడి దారుణ హత్య

by  |
క్షణికావేషంలో యువకుడి దారుణ హత్య
X

దిశ, కుత్బుల్లాపూర్: క్షణికావేశానికి గురైన ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గాజులరామారం సర్కిల్ దావూద్ బస్తీకి చెందిన జావేద్(32) సోమవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై వెళ్తూ ఓ బాలికను ఢీ కొట్టాడు. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో జావేద్‌పై బాలిక తండ్రి శ్రీహరి గొడవకు దిగాడు. వెంటనే గమనించిన స్థానికులు ఇరువురిని సముదాయించి పంపించారు. అయినా.. శ్రీహరి ఆవేశం ఎంతకీ తగ్గకపోవడంతో సాయంత్రం క్షణికావేశానికి గురై జావేద్‌ను కత్తితో పొడిచి చంపాడు. సీసీ కెమెరాల ఆధారంగా హత్య చేసింది శ్రీహరినే అని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed