యువతి రాంగ్ కాల్.. ఆ తర్వాత లాడ్జ్ లో ఏం జరిగిందంటే..?

by  |
యువతి రాంగ్ కాల్.. ఆ తర్వాత లాడ్జ్ లో ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ అన్నాక చాలా సార్లు రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. అనుకోకుండా నంబర్ తప్పు పడడమో, లేక సిగ్నల్స్ లేక వేరేవాళ్లకి కనెక్ట్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా వచ్చిన ఒక రాంగ్ కాల్ ఓ యువకుడిని చావు అంచులవరకు తీసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా మదనపల్లె రామారావు కాలానికి చెందిన మహేష్ అనే యువకుడికి ఓ యువతి నుండి రాంగ్ కాల్ వచ్చింది. కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడి ఫోన్ పెట్టేసింది.

ఆ తర్వాత అదే నంబర్ నుండి కాల్ రావడంతో మహేష్ లిఫ్ట్ చేశాడు. తాను ఇంతకుముందు ఫోన్ చేసిన యువతి అన్ననని పరిచయం చేసుకొని, లాడ్జ్ కి రమ్మని పిలిచాడు. లాడ్జ్ కి వెళ్లిన మహేష్ ని యువతి సోదరుడు, రౌడీ షీటర్ పవన్ రెడ్డి తో కలిసి బంధించారు. వారితో పాటు మరో ముగ్గురు యువకులతో కలిసి మహేష్ పై దాడికి పాల్పడ్డారు. దారుణంగా కాళ్లతో ముఖంపై తన్నుతూ, పిడి గుద్దులు కురిపించారు. తనకేమి తెలియదని మహేష్ ఎంత ఏడ్చినా కనికరించని వారు అతనిని దారుణంగా హింసించారు. ప్రస్తుతం మహేష్ ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story