పెళ్లికి ఆహ్వానించి అతిథులతో ఆ పని చేయించిన వధూవరులు.. నెట్టింట వైరల్

by  |
Wedding Dinner
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లంటే హంగు ఆర్భాటాలు. ఖర్చుకు వెనకాడకుండా పెట్టేస్తారు. వచ్చే బంధుమిత్రులు, వియ్యంకుల వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. ఎంత బీదవారైనా పెళ్లికి వచ్చే అతిథులతో మాట రాకూడదని ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. అయితే ఓ జంట ఎంతో వైభవంగా పెళ్లితంతు చేసినా.. చివరికి వారు చేసిన చిన్న పనికి హాట్ టాపిక్‌గా నిలవడంతోపాటు అభాసుపాలయ్యారు. అయితే వారు చేసిన పనికి కొందరు అతిథులు.. జీవితాంతం గుర్తుంచుకుంటాం అంటుండగా.. మరికొందరు మాత్రం పెళ్లి్కి పిలిచి ఇలా అవమానిస్తారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ వారు ఏం చేశారంటే..

అమెరికాకు చెందిన ఓ జంట తమ పెళ్లిని చాలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకున్నారు. అందుకు అనుగుణంగా వైభవంగా ఏర్పాటు చేసుకున్నారు. వేలాధిమంది బంధుమిత్రులను ఆహ్వానించారు. ఘనంగా పెళ్లితంతు ముగిసింది. వివాహం అనంతరం అతిథులంతా భోజనాలు చేయాలి కదా.. అయితే ఇక్కడే ఆ నవ జంట ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథులతోనే పెళ్లి వంటలు చేయించడంతోపాటు భోజనాల అనంతరం వారితోనే అంట్లు శుభ్రం చేయించారు. అయితే ఇలా ఎందుకు చేయించారో ఆ వధూవరులు వివరణ కూడా ఇచ్చారు. పెళ్లి ఖర్చు తన అంచనాలను మించిపోవడంతో ఇబ్బంది పడ్డామని అందుకే క్యాటరింగ్ వాళ్లను పెట్టకుండా అతిథులతోనే వంట, వార్పు, క్లినింగ్ చేయించామని పేర్కొన్నారు.

అయితే తమను పెళ్లికి పిలిచి ఘోరంగా అవమానించారని ఓ మహిళ హర్ట్ అయింది. తన ఆవేదనను రెడ్దిట్ సోషల్ ప్లాట్ ఫామ్ ద్వారా వెల్లడించింది. పెళ్లికి పిలిచి అతిథులను ఇలా అవమానించారు అంటూ తన బాధను, కోపాన్ని వ్యక్తం చేసింది. పెళ్లికి పిలిచి తినడానికి తిండి పెట్టలేదు సరికదా.. పైగా పనులు చేయించడం ఏంటి అంటూ ప్రశ్నించింది. వచ్చిన వారందరికి వంటలు చేయలేదని వాపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్‌పై పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు తిట్టిపోస్తున్నారు.


Next Story