రెండు రోజుల క్రితం మిస్ అయిన బాలుడు నేడు విగతజీవిగా…

by Disha Web Desk 11 |
రెండు రోజుల క్రితం మిస్ అయిన బాలుడు నేడు విగతజీవిగా…
X

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన కార్తీక్ గౌడ్ (14) రెండు రోజుల క్రితం అదృశ్యం కాగా,నేడు భైంసా నుండి కుబీర్ మండల పార్డి(బి)గ్రామానికి వెళ్లే రహదారి లో వున్న క్రషర్ వద్ద కుంటలో విగతజీవిగా పడి ఉన్నాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కుబీర్ మండలం రంగశివుని గ్రామానికి చెందిన కార్తీక్ గౌడ్(14) భైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. శనివారం కార్తీక్ గౌడ్ ఇంటి నుంచి మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళడని, దీంతో కుటుంబ సభ్యులు ఆరోజు ఎంతకీ వస్తాడని వేచిచూచినా రాకపోవడంతో, సామాజిక మాధ్యమాలలో సైతం కనబడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ పోస్టులు పెట్టారు. కానీ సోమవారం ఉదయం చూసేసరికి కుంటలో విగత జీవిగా పడి ఉన్నాడు. గమనించిన కొందరు సమాచారం అందించగా వెతికి తీసిన బాలుడు కార్తీక్ గౌడ్ అని గమనిoచారు. బాలుని మృతదేహం వద్ద తల్లి, సోదరునీ,బంధువుల రోదనలు మిన్నంటాయి.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Next Story