- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్ : ఓ వృద్ధురాలిని హత్య చేసి అనంతరం లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడులో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. వృద్ధురాలు(65) తన కూమారుడికి సొంత ఊరిలో బొప్పాయి తోట ఉంది. ఆ బొప్పాయి పనులను వృద్ధురాలైన తన తల్లి చూస్తుంది. ఈ నేపథ్యంలో అందులో పనిచేయడానికి పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు వ్యక్తులను తన బొప్పాయితోటలో కూలీలుగా పెట్టాడు. రోజూలానే వృద్ధు రాలు బొప్పాయి తోట పనులు చూసుకోవడానికి తోటకు వెళ్లింది. ఈ క్రమంలో బెంగాల్ నుంచి వచ్చిన కూలీలలో ఓ బాలుడితో పని పరంగా వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ బామ్మ మీద బాలుడు కక్ష్య పెట్టుకున్నాడు. మరసటి రోజు వృద్ధురాలు బొప్పాయితోటకు వచ్చి గడ్డికోస్తూ.. పనులలో నిమగ్నం అయ్యింది. దానినే అవకాశంగా తీసుకున్న బాలుడు వృద్ధురాలిని గడ్డపారతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె చనిపోయింది. వృద్ధురాలు చనిపోయిందని నిర్ధారించుకున్న బాలుడు అనతరం ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బెంగాల్ కు చెందిన బాలుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలుసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు ఆదేశాలతో జువైనల్ హోమ్కు తరలించారు.