ఇందారం ఎక్స్ రోడ్డులో మృతదేహం కలకలం..

by  |
unidentified body
X

దిశ, చెన్నూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇందారం ఎక్స్ రోడ్డులో సుమారు 55-60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి చనిపోయాడని సర్పంచి గడ్డం మంజుల జైపూర్ ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కేసు నమోదు చేసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు.

కాగా మృతుడు 5.5 అడుగుల ఎత్తు, నలుపు రంగులో కోలముఖం కలిగి ఉన్నాడని ఎస్ఐ తెలిపారు. మృతుడి నడుముచుట్టూ ఎరుపు, పసుపు, తెలుపు రంగుల గీతల చున్ని చుట్టుకొని ఉన్నాడని వివరించారు. ఆచూకీ తెలిసినవారు జైపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని లేదా జైపూర్ ఎస్ఐ 9440795046, శ్రీరాంపూర్ సీఐ 9440795045 నంబర్లను సంప్రదించాలని కోరారు.


Next Story

Most Viewed