మత్య్సకారులు వేటకు వెళ్లొస్తుండగా.. సముద్రంలో బోటు బోల్తా

by  |
boat capsized
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఉప్పాడ సముద్రతీరం వద్ద మత్య్సకారుల బోటు బోల్తాపడింది. చేపల వేటకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. నీటమునిగిన బోటులో ఆరుగురు మత్య్సకారులు ఉండగా, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బోటులో మత్య్సకారుల సామాగ్రి, చేపలు గల్లంతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2 లక్షల నష్టం వాటిల్లిందని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story