జనగామ లో రక్తదానం.. ముఖ్య అతిథులుగా..

by  |
జనగామ లో రక్తదానం.. ముఖ్య అతిథులుగా..
X

దిశ, జనగామ: మనం చేసే రక్తదానం ఆపదలో ఉన్న మరొకరి ప్రాణ దానంగా మారుతుందని జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ పిలుపుమేరకు జనగామ డిపో మేనేజర్ లక్ష్మీ ధర్మ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేందుకు డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యం, చురుకుదనంతో పాటు మరొకరి ప్రాణం నిలబెట్టిన వారవుతారని అన్నారు.

రాష్ట్రంలో రక్తం కొరత ను గుర్తించి ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తూ సజ్జనార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ సుగుణాకర్ రాజ్, డాక్టర్ రాజమౌళి, జనగామ సీఐ బాలాజీ వరప్రసాద్, జిల్లా వైద్యశాల వైద్య బృందం పాల్గొన్నారు.

Next Story

Most Viewed