అనుమానాస్పదస్థితిలో అటెండర్ భార్య మృతి

by  |
vivahitha-died1
X

దిశ, మక్తల్: నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శబరి కాలనీలో నివాసముండే రేఖ అనే మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. తల్లి మృతదేహం వద్ద కూతురు ఏడుస్తుండగా చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూడగా తల్లి అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మాగనూరు మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్ లో అటెండర్ గా పని చేస్తున్న రేఖ భర్త రాధాకృష్ణ(45) పరారీలో ఉన్నట్లు సమాచారం. రాధాకృష్ణ రోజూ మద్యం సేవిస్తాడని, ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారని స్థానికులు తెలిపారు.

Next Story

Most Viewed