ఆక్సిజన్ కొరత: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by  |
ఆక్సిజన్ కొరత: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆక్సిజన్ కొరత వల్ల పలువురు కరోనా రోగులు మరణిస్తున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రూ.309 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 10 వేల అదనపు పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల కోసం ప్రతి జిల్లాకు రాబోయే 6 నెలలకు రూ.60 లక్షలు మంజూరు చేయనున్నారు.



Next Story