పంపకాల పంచాయితీ.. బయటపడ్డ లంకెబిందె వ్యవహారం

by  |
Lanke Binde
X

దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో లంకెబిందె కలకలం రేపింది. జిల్లాలోని చివ్వెంల మండలం తుల్జారావుపేట గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొందరు ట్రాక్టర్‌తో భూమిని చదును చేస్తుండగా లంకెబిందె లభ్యం అయింది. ఆ లంకెబిందెను ఓపెన్ చేసి చూడగా.. భారీగా బంగారం ఉంది. కాగా, ఆ బంగారం పంపకాల్లో ముగ్గురి మధ్య గొడవ తలెత్తింది. ఒకరికి 14 లక్షల విలువైన బంగారం, మరొకరికి 10 లక్షల విలువైన బంగారాన్ని పంచి మిగతా దానికి మరో వ్యక్తితో పంచుకునేలా ఓ హోంగార్డు సెటిల్ చేశారు. దీంతో వారికి అనుమానం వచ్చి గొడవ పడ్డారు. ఈ ఘర్షణ మూలంగా వ్యవహారం గ్రామంలో మొత్తం తెలిసింది.



Next Story

Most Viewed