అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యే

by  |
అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు గానూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే.. గుజరాత్ రాష్ట్రంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. కేసరిసిన్హా జేసంగ్ బాయ్ సోలంకి అనే బీజేపీ ఎమ్మెల్యే.. అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన శుక్రవారం ఆస్పత్రి నుంచి అంబులెన్సులో అసెంబ్లీకి వచ్చారు. అనంతరం పోలీంగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.

Next Story