- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,ప్రతినిధి, ఖమ్మం :
ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద జరిగినవి ఎదురుకాల్పులు కావనీ, దొంగ ఎదురు కాల్పులంటూ మావోయిస్టు పార్టీ అభివర్ణించింది. అక్టోబర్ 18న మరో ఇద్దరు ఆదివాసి బిడ్డలను టీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేసిందని తెలిపింది. ఈ హత్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చింది. హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, కోర్టు ద్వారా న్యాయ విచారణ చేపట్టాలని కోరింది. ఈ హత్యలకు పాల్పడిన పోలీసులను కఠినంగా శిక్షించాలని కోరింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మంగళవారం ఒక ప్రకటన విడుదలైంది. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తూ పౌర హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని లేఖలో దుయ్యబట్టింది.
Next Story