ఈ మహిళ అదృష్టం మాములుగా లేదు.. నత్తను కొని కోటీశ్వరరాలు ఐపోయింది

by  |
ఈ మహిళ అదృష్టం మాములుగా లేదు.. నత్తను కొని కోటీశ్వరరాలు ఐపోయింది
X

దిశ, వెబ్ డెస్క్: అదృష్టం ఎవరి రూపంలో ఎప్పుడు వస్తుందో ఎవరం చెప్పలేము. అందుకే అంటారేమో అదృష్టవంతులను ఎవరు ఆపలేరు అని. తాజాగా ఒక నత్త వలన ఒక మహిళ తలరాత మారిపోయిన ఘటన థాయిలాండ్ లో వెలుగుచూసింది. కేవలం రూ.163 లు పెట్టుబడి పెట్టి కోట్లకు అధిపతిగా మారింది. ఆమె తలరాత మార్చిన ఆ కథ ఏంటంటే… కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే థాయ్‌ మహిళ రాత్రి భోజనం కోసం దగ్గర్లో ఉన్న చేపల మార్కెట్ కి వెళ్లి రూ.163 లు పెట్టి నత్తలను కొనుగోలు చేసింది.

ఇంటికి వెళ్లి కూర వండడానికి నత్తలను క్లీన్ చేస్తుండగా ఆమెకు ఒక నారింజ రంగు రాయి కనిపించింది. అది ఏంటా? అని ఆశ్చర్యంగా చూసిన మహిళ ఆ రాయిని పరిశీలనకు పంపింది. అంతే ఇప్పటివరకు ఆ మహిళకు ఉన్న దరిద్రం మొత్తం పోయిందనట్లు అది మాములు రాయి కాదు అరుదైన జాతికి చెందిన ముత్యం అని తెలిసింది. దాని విలువ కోట్ల రూపాయలు విలువ చేస్తుందని భావిస్తుంది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఒక రాయి తో ఈ మహిళ కోటీశ్వరులు ఐపోయింది. ఈ ముత్యాన్ని కొనుగోలు చేసే వారికోసం ఎదురుచూస్తున్నట్లు తాంతివిట్కుల్ తెలిపింది.



Next Story

Most Viewed