జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి

by  |
జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల కలకలం స‌ృష్టించాయి. సోపోర్‌లో సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని గ్రనేడ్‌తో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో నలుగురు మరణించారు. ఇందులో ఇద్దరు జవాన్లు ఉండగా మరో ఇద్దరు పౌరులు ఉన్నారు. అలాగే మరో ఇద్దరు పోలీసు జవాన్లు ప్రమాదంలో గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Next Story