ఘోర ప్రమాదం.. బావిలో పడిన జీపు

by  |
ఘోర ప్రమాదం.. బావిలో పడిన జీపు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం సాయంత్రం సంగెం మండలం గవిచర్ల శివారులోని ఓ బావిలో అదుపు తప్పి జీపు బోల్తా పడింది. ప్రమాద సమయంలో జీపులో 15మంది ఉన్నట్లు తెలుస్తుండగా.. ఏడుగురు సురక్షితంగా బయట పడ్డారు. మరో 8మంది కోసం పోలీసులు, అధికారులు, స్థానికులు గాలిస్తున్నారు. రోజు వారి కూలీ పనుల్లో భాగంగా వరంగల్ వెళ్లి తిరిగి నెక్కొండ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.


Next Story

Most Viewed