బిచ్‌కుందలో ఉద్రిక్తత

by  |
బిచ్‌కుందలో ఉద్రిక్తత
X

దిశ,వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని బిచ్‌కుందలో ఓ యువకుడిని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఆ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ఇసుక లారీకి నిప్పంటించారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానికులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు శాంతించక పోగా పోలీసులపైనే దాడి చేశారు. అటుగా వెళుతున్న మరో మూడు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. కాగా గాయపడిన వ్యక్తిని గోపన్‌పల్లికి చెందిన విజయ్(28)గా గుర్తించారు. అతన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Next Story

Most Viewed