మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఉద్రిక్తత

by  |
మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రామ్‌నగర్ MCH కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం ఓపెనింగ్‌కు మున్సిపల్ మంత్రి కేటీఆర్ వచ్చారు. ఇదే సమయంలో అక్కడి స్థానిక బీజేపీ యువ నాయకులు కేటీఆర్‌ కాన్వాయ్‌కు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ఓ వైపు కేసీఆర్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నాయకులు నినాదించగా.. మోడీ డౌన్ డౌన్ అంటూ టీఆర్ఎస్ నేతలు కూడా వరుస నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేపట్టిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Next Story