- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉప్పుగూడ కాళీమాత దేవాలయం భూములు సర్వే నెంబర్ 24, 25, 26లో ఏడు ఎకరాల 13గుంటల భూమిలో ఓ వ్యక్తి నిర్మాణాలు చేపడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. 1951 నుంచి ఆ భూములు దేవాదాయశాఖ ఆధినంలో ఉన్నాయని వెంటనే నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. అయితే ఈ భూములను తనకు ఆలయ ట్రస్ట్ అమ్మిందంటూ ఆ వ్యక్తి పోలీసుల సాయంతో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. మళ్లీ స్థానికులు భూముల్లోకి వెళ్లి బైఠాయించడంతో వారికి మద్దతు తెలిపేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెళ్లారు. పోలీసులు భారీగా మోహరించి స్థానికులను చెదరగొడుతున్నారు.
Next Story