దీక్ష భగ్నం.. లోటస్‌పాండ్‌కు షర్మిల పాదయాత్ర

by  |
దీక్ష భగ్నం.. లోటస్‌పాండ్‌కు షర్మిల పాదయాత్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్ షర్మిల ధర్నాచౌక్‌ వద్ద చేపట్టిన కొలువు దీక్ష సాయంత్రానికి స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. శిబిరం వద్దకు పోలీసులు భారీగా చేరుకొని దీక్ష భగ్నం చేశారు. దీంతో వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నియామకాలన్ని కేసీఆర్ కుటుంబానికే దక్కుతున్నాయని.. ప్రశ్నించకపోతే తెలంగాణ మొత్తాన్ని దొరగారు లూటీ చేస్తారని ఆరోపించారు. 72 గంటలు దీక్ష చేయాలని అనుకున్నప్పటికీ.. పాలకులు అనుమతి ఇవ్వలేదని.. దీక్షపై మాట ఇచ్చిన నిలబెట్టుకుంటానని ఆమె వెల్లడించారు. ఆడబిడ్డగా కేసీఆర్ పై పోరు ప్రారంభించానని.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడే దీక్ష చేస్తానని.. పొరాటం కొనసాగిస్తానంటూ షర్మిల స్పష్టం చేశారు.



Next Story

Most Viewed