యువకుల దౌర్జన్యం.. గొంతుకోసి ఒకరి హత్య

by  |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం నర్సింగపేటలో దారుణం చోటుచేసుకుంది. కొందరు యువకులు స్థానికంగా వీరంగం సృష్టించడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఒకరి గొంతుకోసి దారుణంగా హతమార్చారు. మరో వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఇద్దరు మహిళలపై కర్రలతో దాడి చేశారు.

ఈ అల్లర్లలో మొత్తంగా 10మందికి పైగా దుండగులు ఉన్నట్లు మణ్యం ప్రజలు చెబుతున్నారు. వారంతా భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Next Story