తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

by  |
తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
X

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీని చలి తీవ్రత వణికిస్తోంది. మినుములూరులో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 7.8, అరకు, పాడేరులో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొమురం భీమ్‌లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 10.6, సంగారెడ్డిలో 11, నిర్మల్ లో 11.8 డిగ్రీలు, రంగారెడ్డిలో 11.9, జయశంకర్, మంచిర్యాలల్లో 12.1 డిగ్రీలు ఉప్ణోగ్రత ఉంది. ఇక జగిత్యాల, ములుగులో 12.4, వికారాబాద్‌లో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంది.

Next Story

Most Viewed