- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా ఊపిరి ఉన్నంతకాలం మీకోసమే జీవిస్తా: షర్మిల
దిశ, రామన్నపేట: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో ప్రజల సమస్యల కోసం పనిచేసే నాయకులు లేరని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర రామన్నపేట మండలంలో రెండోరోజూ రామన్నపేట మండలంలో కొనసాగింది. సిరిపురం, వెల్లంకి గ్రామాల మీదుగా వలిగొండ మండలానికి చేరుకుంది. సిరిపురంలో చేనేత కార్మికుల నివాసాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ తమ గ్రామాన్ని సందర్శించి చేనేతలకు రుణమాఫీ చేశాడని ఈ సందర్భంగా వారు షర్మిలతో చెప్పుకున్నారు. అనంతరం వెల్లంకిలో జరిగిన సమావేశంలో ఆమె ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
ఇంటికో ఉద్యోగం వంటి అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని విస్మరించారని విమర్శించారు. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ప్రభుత్వానికి చలనం లేదన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ నిరంతరం ప్రజల బాగుకోసం పరితపించే వారని, అలాంటి సంక్షేమ పాలన నేడు తెలంగాణ ప్రజలకు అందించడమే తన ముందున్న లక్ష్యం అన్నారు. తమ పార్టీ ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేయడానికి ఆవిర్భవించిందని తన ఊపిరి ఉన్నంతవరకు ప్రజల సంక్షేమం కోసం జీవిస్తానని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఈ పాదయాత్ర బృందంలో పాదయాత్ర కో-ఆర్డినేటర్ పిట్ట రాంరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కోఆర్డినేటర్ అతాహర్, మాట ముచ్చట కోఆర్డినేటర్ చైతన్య రెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.