ఒడిశా నుంచి గంజాయి తెప్పించి విక్రయాలు.. యువకుడు అరెస్ట్

by Jakkula.Mamatha |

ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఒడిశా నుంచి గంజాయి తెప్పించి విక్రయాలు.. యువకుడు అరెస్ట్
X

దిశ,మేడ్చల్: ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ఓ యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అలోక్ సర్కార్(20) ప్రస్తుతం కిస్తాపూర్ నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు సోహైల్(22) సహకారంతో ఒడిశా నుంచి 2 కిలోల ఎండు గంజాయిని విక్రయాల కోసం తెప్పించినట్లు విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు అలోక్ సర్కార్‌ను అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి సుమారు రూ.లక్ష రూపాయల విలువైన 2 కిలోల ఎండు గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సహచరుడు సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

Next Story