విషాదం.. గోదావరిలో యువకుడు గల్లంతు

by Dishanational1 |
విషాదం.. గోదావరిలో యువకుడు గల్లంతు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలోని గోదావరి నదిలోకి ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. గోదావరి నదికి మనోహర్, దుష్యంత్, గణేష్ అనే ముగ్గురు యువకులు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో మనోహర్, దుష్యంత్ లకు భయం వేయంతో అరుపులు, కేకలు పెట్టారు. దీనిని గమనించిన అక్కడ ఉన్న స్థానికులు వెంటనే ఆ ఇద్దరు యువకులను కాపాడారు. కానీ గణేష్(17) అనే యువకుడు గల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే గజ ఈతగాళ్లతో ఆ యువకుని ఆచూకీ కోసం గోదావరిలో గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed