అలాంటి పాత్ర కోసం పదేళ్లు వేచి చూశా.. యామీ గౌతమ్‌

by Disha Web Desk 17 |
అలాంటి పాత్ర కోసం పదేళ్లు వేచి చూశా.. యామీ గౌతమ్‌
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బ్యూటీ యామీ గౌతమ్‌ నటించిన తాజా చిత్రం 'ఎ థర్స్‌ డే'. ఫిబ్రవరి 19 న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ఇందులో ప్రైమరీ స్కూల్‌ టీచర్‌ 'నైనా' పాత్రలో నటించిన యామీ.. భావోద్వేగాలతో నిండిన పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. ఈ మేరకు సినిమా విజయం సాధించిన సందర్భంగా ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడిన నటి.. ఇలాంటి పాత్ర కోసం పదేళ్లు వేచి చూశానని చెప్పింది. అలాగే ఈ చిత్రం చూసిన తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఎమోషనల్‌ అవుతున్నారని తెలిపిన బ్యూటీ.. ఈ సినిమా తర్వాత తనలో వ్యక్తిగతంగా ఎంతో మార్పు వచ్చిందంటోంది. ఈ క్రమంలోనే బాధిత మహిళల కోసం పోరాటం చేయాలనుకునే వాళ్లంతా ఏదైనా సేవా సంస్థలో పని చేయాలని, దీనికోసం సెలబ్రిటీనే కావాల్సిన అవసరం లేదన్న యామీ.. సాధ్యమైనంత మేరకు సాయం చేసుకుంటూ వెళ్లాలని సూచించింది.



Next Story

Most Viewed