WorldCup: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

by Disha Web Desk 2 |
WorldCup: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత మహిళలు వరల్డ్ కప్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ వరల్డ్ కప్ పోటీల్లో భారీ స్కోరు సాధించింది. స్మృతి మందాన (123) టాప్ స్కోరర్ గా నిలవగా, హర్మన్ ప్రీత్ కౌర్ (109) పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్లు డియాండ్రా 46 బంతుల్లో 62 పరుగులు చేయగా.. హేలీ మ్యాథ్యూస్ 36 బంతుల్లో 43 పరుగులతో బౌండరీనే లక్ష్యంగా దంచికొట్టి శుభారంభం చేశారు. అయితే వారిని నిలువరించడానికి భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయి వరుసగా పెవిలియన్‌కు పంపడంతో కట్టడి చేసినట్లయ్యింది. ఓపెనర్లతో పాటు వచ్చినవాళ్లంతా వచ్చినట్లే వెనుదిరగాల్సివచ్చింది. 162 పరుగులకే అందరూ ఆలౌట్ అవ్వడంతో విండీస్‌పై టీమిండియా 155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో స్నేహ రాణా 3, మేఘ్నా 2 వికెట్లు, రాజేశ్వరి, పూజూ, ఝలన్ గోస్వామి తలో వికెట్ తీసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టారు.



Next Story

Most Viewed