బంధువు ఇంట్లో వేడుకకు వెళ్తున్న జంట.. అంతలోనే

by Dishanational2 |
బంధువు ఇంట్లో వేడుకకు వెళ్తున్న జంట.. అంతలోనే
X

దిశ, చిలుకూరు: లారీ ఢీ కొనడంతో మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా చిలుకూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం ద్వారకుంటకు చెందిన దొంగరి రమేష్ తన భార్య శ్రీదేవి (40)తో కలిసి బైక్ పై వెళుతున్నాడు. పాలకీడు మండలం బొత్తలపాలెంలో వారి బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో చిలుకూరులోని కాలువ ఒడ్డు అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర లారీ ఢీకొట్టడంతో శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలైన రమేష్‌ను స్థానిక ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి లారీని తమ అధీనంలోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు.

Next Story

Most Viewed