ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్య ఆత్మహత్య!

by Web Desk |
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే భార్య ఆత్మహత్య!
X

దిశ, పెద్దేముల్: భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుని మూడు సంవత్సరాలు గడవకముందే తన భార్య అందంగా లేదంటూ ఆమెపై వేధింపులకు దిగాడు ఓ భర్త. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేని ఆ మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టింది.




వివరాల్లోకి వెళితే.. జిన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్, యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీత (23)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కాపురం చిన్న చిన్న తగాదాలు కాస్త పెద్దదయింది. భర్త మహేష్.. భార్య ను నువ్వు అందంగా లేవంటూ.. నువ్వు చనిపోతే మరో వివాహం చేసుకొని దర్జాగా ఉంటానంటూ వేధింపులు గురి చేయడంతో పాటు శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడు. ఈ మధ్యకాలంలో వేధింపులు తారా స్థాయికి చేరుకోవడంతో తట్టుకోలేని సునీత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మృతురాలి సోదరి అనిత ఫిర్యాదు మేరకు కరణ్కోట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story