- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా జరిగితే భారత్పై అణుదాడి చేస్తాం.. పాక్ మాజీ హైకమిషనర్ వివాదాస్పద వ్యాఖ్యలు!
అమెరికా దాడి చేస్తే ముంబై, ఢిల్లీపై అణుబాంబులు వేస్తామంటూ పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంచలన వ్యాఖ్యలు. తులసీ గబ్బార్డ్ హెచ్చరికల వేళ పాక్ బరితెగింపు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్కు చెందిన మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ (Abdul Basit) అంతర్జాతీయ వేదికపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అత్యంత బాధ్యతారాహిత్యమైన అతని వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ వేదికపై ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ అమెరికా పాకిస్థాన్పై దాడికి దిగితే, తాము భారత్లోని ముంబై, ఢిల్లీ నగరాలపై అణుబాంబులతో విరుచుకుపడతామని ఈ సందర్భంగా హెచ్చరించాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "అమెరికా మా అణుశక్తి పరిధిలో లేదు. కాబట్టి మా లక్ష్యం ఖచ్చితంగా ఇండియానే అవుతుంది" అని బాసిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మాజీ హైకమిషనర్ హోదాలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యూఎస్ ఇంటెలిజెన్స్ ముందస్తు హెచ్చరిక
అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలకు రెండు రోజుల ముందే అమెరికా నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ పాక్ నుంచి పొంచి ఉన్న అణు ముప్పును ప్రస్తావించడం గమనార్హం. పాకిస్తాన్ అస్థిరత వల్ల ప్రపంచానికి, ముఖ్యంగా పొరుగు దేశాలకు న్యూక్లియర్ థ్రెట్ (అణు ముప్పు) ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు బాసిత్ చేసిన వ్యాఖ్యలు ఆమె హెచ్చరికలను బలపరుస్తున్నట్లుగా ఉన్నాయి. అమెరికాపై కోపాన్ని భారత్పై తీర్చుకుంటామని పాక్ ప్రతినిధులు బహిరంగంగా చెప్పడం వారి దుందుడుకు స్వభావాన్ని, ప్రాంతీయ అశాంతిని కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.






