ఏపీలో వార్డుల పునర్విభజన గడువు పెంపు..అధికారుల స్పష్టీకరణ

by Malleboina Mahesh |

ఏపీలో వార్డుల పునర్విభజన గడువు పెంపు! 2027 జనగణన పనుల్లో సిబ్బంది బిజీగా ఉండటంతో డీలిమిటేషన్ ఆలస్యం. ఖచ్చితత్వం కోసమే నిర్ణయం.

ఏపీలో వార్డుల పునర్విభజన గడువు పెంపు..అధికారుల స్పష్టీకరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియ (Ward redivision process)కు ప్రభుత్వం గడువును పొడిగించింది. ప్రస్తుతం క్షేత్రస్థాయి సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం అంతా 2027 జనగణన (Census) పనుల్లో నిమగ్నమై ఉండటంతో, వార్డుల డీలిమిటేషన్ పనులకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో రెండు కీలకమైన ప్రక్రియలను ఏకకాలంలో నిర్వహించడం వల్ల ప్రస్తుత షెడ్యూల్ అమలు చేయడం కష్టతరంగా మారిందని అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వార్డుల పునర్విభజన లో జనాభా గణాంకాల ఖచ్చితత్వం, భౌగోళిక సరిహద్దుల క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత కీలకమని అధికారులు స్పష్టం చేశారు. సరిహద్దుల సరిపోల్చడం, భౌగోళిక సవరణలు చేయడానికి మరింత సమయం అవసరమని వారు పేర్కొన్నారు. ఒకవేళ తొందరపాటుతో డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే, భవిష్యత్తులో సాంకేతిక తప్పులు, రాజకీయ వివాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారదర్శకమైన, లోపరహితమైన వార్డుల విభజన కోసమే ఈ అదనపు సమయాన్ని కేటాయించినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది.

Next Story