ఏడాది పూర్తి చేసుకున్న 'ఉప్పెన'.. స్పెషల్ నోట్ రాసిన కృతి‌శెట్టి

by Web Desk |
ఏడాది పూర్తి చేసుకున్న ఉప్పెన.. స్పెషల్ నోట్ రాసిన కృతి‌శెట్టి
X

దిశ,సినిమా: మొదటి సినిమా 'ఉప్పెన'లో అందం, అభినయంతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది కృతి శెట్టి. అంతేకాదు వైష్ణవ్ తేజ్‌కు కూడా హీరోగా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. కాగా నేటితో ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్పెషల్ నోట్ షేర్ చేసిన కృతి.. 'ఉప్పెనకు 1 సంవత్సరం. మన జీవితంలో రెండు పుట్టిన రోజులు ఉంటే.. అందులో ఒకటి మనం పుట్టిన రోజు మరొకటి మనం లైఫ్‌లో ఏం చేయాలో ఎంచుకునే రోజు. నా కెరీర్ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయింది. అందుకే ఈ రోజును నా మరో పుట్టిన రోజుగా ఎంచుకుంటాను. ఈ ఏడాది నన్ను ఆప్యాయంగా స్వీకరించింది. ప్రస్తుతం నేను ఇష్టపడే పని చేస్తూ, చాలా సంతోషంగా ఉన్నాను. మీ ప్రేమ, అభిమానం నన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చిన నా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు. నేను మరింత కష్టపడి పని చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. మీకు ఉప్పెన టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చింది.

https://www.instagram.com/p/CZ3nUdRJPO8/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed