- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని మూడో నంబర్ ప్లాట్ఫాంపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. స్టేషన్ మేనేజర్ అందించిన సమాచారం మేరకు సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తి గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్లాట్ఫాంపై మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అనారోగ్య కారణాలతో సహజ మరణం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే మృతుడిని గుర్తించేలా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేదా ఇతర ఆధారాలు లభించలేదని తెలిపారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ (ఆర్హెచ్సీ-76) ఎ.సురేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డిని 8712658591 నంబర్లో సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Next Story






