కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. వేడుక కోసం వచ్చిన యువకులు గల్లంతు

by Disha Web Desk 2 |
కరీంనగర్‌లో తీవ్ర విషాదం.. వేడుక కోసం వచ్చిన యువకులు గల్లంతు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: వేడుకలో పాల్గొని తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు వచ్చిన వారు వరద కాలువలో గల్లంతయ్యారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రంగరావుపల్లిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని గంగాధర మండలం రంగారావుపల్లికి చెందిన ఎండీ ఖలీమ్ బంధువులు జమీర్, ఉస్మాన్, కరీం, సమీర్ కరీంనగర్‌లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యేందుకు సికింద్రాబాద్ నుండి ఆదివారం వచ్చారు. సోమవారం రంగారావుపల్లికి చేరుకున్న వీరు ఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని వరదకాలువకు ఖలీమ్, అతడి బావమరిది జమీర్, బంధువులు ఉస్మాన్, కరీం, సమీర్ లు వెళ్లారు. ఖలీమ్, జమీర్, సమీర్ ఈత కొట్టేందుకు వరదకాలువలోకి దూకగా ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న కరీం కాలువలోకి దూకి సమీర్‌ను క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఖలీమ్, జమీర్‌ల కోసం కాలువలో వెతకగా వారి ఆచూకీ దొరకలేదు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఖలీమ్, జమీర్ల డెడ్ బాడీల కోసం గాలింపు చేపట్టామని గంగాధర ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed