బీచ్‌లో ఏకాంతంగా ప్రేమజంట.. ప్రియుడి ముందే లవర్‌పై ఇద్దరు అత్యాచారం

by Disha Web Desk |
బీచ్‌లో ఏకాంతంగా ప్రేమజంట.. ప్రియుడి ముందే లవర్‌పై ఇద్దరు అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం అత్యాచారాల నివారణకు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కొందరిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఆడ వాసన తగిలితే గుడి, బడి అనే తేడా లేకుండా పశువుల్లా మీదపడుతున్నారు. ఆహ్లాదం కోసం పర్యాటక కేంద్రాలకు వెళ్లినా అక్కడా వదలడం లేదు. అదును దొరికితే చాలు.. మృగాళ్ల మారుతున్నారు. తాజాగా ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా బందరు మండలం పల్లిపాలెం బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు పల్లిపాలెం బీచ్‌‌కు వెళ్లారు. అక్కడ ఆహ్లాదకర వాతావరణంలో ప్రేమికులు సేద తీరుతుండగా బీచ్‌లో మద్యం తాగడానికి వచ్చిన యువకుల కంటపడ్డారు. ఫుల్‌గా మద్యం తాగిన ఇద్దరు యువకులు లవర్స్‌ను అడ్డుకున్నారు. తాగిన మత్తులో ప్రియుడిని చెట్టుకు కట్టేసి అతడి కళ్ల ముందే ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఇద్దరు యువకులు ఆమెను దారుణంగా హింసిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారిని అక్కడే వదిలేసి పారిపోయారు.

ఈ షాక్ నుంచి తేరుకున్న ప్రేమ జంట నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘోరాన్ని వివరించారు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం నిందితుల్లో ఒకరైన నాగబాబును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందుతుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇటీవల ఇదే బీచ్ లో ఓ యువతిపై గంజాయి మత్తులో ఉన్న యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అది మరవక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

Next Story