FLASH: అనంతపురంలో ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Disha Web Desk 2 |
FLASH: అనంతపురంలో ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా మిడుతూరు వద్దనున్న ఎన్‌హెచ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని వెనకాల నుంచి వోల్వో బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా, మరో 15 మందికి గాయాలు అయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. వోల్వో బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed