- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడువు ముగిసిన పదార్థాలతో బేకరీ ఉత్పత్తులు.. ఇద్దరి అరెస్ట్
జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్పూర్లో అక్రమంగా ఏంసీఆర్ బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది.

దిశ,మేడ్చల్: జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్పూర్లో అక్రమంగా ఏంసీఆర్ బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది. ట్రేడ్, ఫుడ్ లైసెన్స్లు లేకుండానే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లతో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. తయారీ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
దాడుల్లో మజీద్పూర్ క్రాస్ రోడ్కు చెందిన బోడ ఆనంద్ (38), బోడ సౌజన్య (32)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 కృత్రిమ రంగుల సీసాలు, ఒక లీటర్ గడువు ముగిసిన బటర్స్కాచ్ ఫ్లేవర్, 500 మిల్లీ లీటర్ల చొప్పున మూడు గడువు ముగిసిన ఫ్లేవర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






