కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ సర్కార్: మాజీ ఎమ్మెల్యే

by Dishafeatures2 |
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ సర్కార్: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, కంది : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎల్లవేళలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం చిమ్మా పూర్ గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త మన్నే పాండు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ మేరకు మంగళవారం మృతి చెందిన కార్యకర్తకు పార్టీ సభ్యత్వం ఉన్నందున వారి కుటుంబానికి రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును చింతా ప్రభాకర్ అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతీ కార్యకర్త అనుకోని ప్రమాదం, ఇతర కారణాల చేత మృతి చెందితే వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి రూ.2 లక్షల బీమా చెక్కును అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, ఎంపీపీ సరళ, జడ్పీటీసీ కొండల్ రెడ్డి, ఎంపీటీసీ నంద కిశోర్, తెరాస కంది మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, చిల్వరి ప్రభాకర్, మోహన్ రెడ్డి, రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణ గౌడ్, శంకర్ గౌడ్, వెంకట్ రెడ్డి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed